‘మీ సేవ’ లావాదేవీలు 7 కోట్లు పైనే

22 Jul, 2016 03:08 IST|Sakshi

నేడు మరిన్ని సేవలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ‘మీసేవ’ విభాగం రూ.7 కోట్ల లావాదేవీలను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. రెవెన్యూ, పోలీసు, పౌర సరఫరాల విభాగాలకు చెందిన కొత్త సేవలను శుక్రవారం హోటల్ హరితప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు