మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్ష ఖరారు!

9 Apr, 2015 14:09 IST|Sakshi

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్ష ఖరారు కానుంది.  ఇప్పటికే ఈ కేసులో నిందితులను దోషులుగా ప్రకటించింది.  తీర్పు అనంతరం న్యాయమూర్తి ...దోషులతో విడివిడిగా న్యాయమూర్తి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దోషులు తమ వాదనలు వినిపించారు.  ఈ కేసులో వాదనలు ఆరు నెలల క్రితమే పూర్తయ్యాయి. మరోవైపు సమాజానికి తాను చేసిన సేవ చూసి అయినా శిక్ష తగ్గించాలని రామలింగరాజు ...న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ తీర్పుపై రామలింగరాజు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

 

మరిన్ని వార్తలు