యాకుత్పురా,న్యూస్లైన్: మొఘల్పురా పోలీసులు ఓ దొంగను అరెస్టు చేసి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీ నం చేసుకున్నారు. శనివారం మీర్చౌక్ ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్జిల్లా కామారెడ్డి లింగయ్యపల్లికి చెందిన షేక్ మహ్మద్ (26) జల్సాలకు అలవాటుపడ్డారు.
అవసరమైన డబ్బుల కోసం అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు మోదీతో కలిసి రెండేళ్లుగా వాహన చోరీలకు పాల్పడుతున్నాడు. పార్కింగ్, హోటళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిలిపి ఉన్న బైకులను మారు తాళాలతో ఎత్తుకుపోతున్నారు. గతంలో నిజామాబాద్లో చోరీలకు పాల్పడ్డ వీరు కొన్ని రోజు లుగా నగరంలో తమ పంజా విసురుతున్నారు. ఇక్కడ చోరీ చేసిన వాహనాలను నిజామాబాద్కు తరలించి విక్రయిస్తున్నారు. ఈనెల 28న మొఘల్పురా పోలీసులు సుధా థియేటర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో షేక్మహ్మద్ ఓ బైక్పై వెళ్తుండ గా ఆపారు.
పత్రాలు లేకపోవడంతో స్టేషన్కు తరలించి విచారించగా.. ఆ వాహనాన్ని చోరీ చేసి తెచ్చినట్టు అంగీ కరించాడు. మోదీతో కలిసి వాహనాలను చోరీ చేస్తున్నట్టు చెప్పాడు. దీంతో అదనపు ఇన్స్పెక్టర్ జి.నవీన్ కుమార్, డిటెక్టివ్ ఎస్సై మల్లేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం నిజామాబాద్ వెళ్లి మహ్మద్ ఇంటిలో ఉన్న 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంది. మహ్మద్ను రిమాండ్కు త రలించి, పరారీలో ఉన్న మరో నింది తుడు మోదీ కోసం గాలిస్తున్నారు. వీ రిపై నిజామాబాద్లోని వర్నీ, ఎస్ఎస్నగర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.