సికింద్రాబాద్: సికింద్రాబాద్ నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన సికింద్రాబాద్ గోరఖ్పూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12590) ఆలస్యంగా బయలు దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్ఓ ఎం.ఉమాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఉదయం 7.20 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు రాత్రి 10.15 గంటలకు బయల్దేరుతుందని పేర్కొన్నారు.