సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం

9 Apr, 2015 11:45 IST|Sakshi
సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం

హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో దోషులకు శుక్రవారం శిక్ష ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రామలింగరాజును దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.  రామలింగరాజు సహా పదిమందిపై నేరం రుజువైంది. మరోవైపు దోషులకు శిక్షలపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.  కాగా ఈ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి 46 పేజల తీర్పును చదివి వినిపించారు. దోషులకు గరిష్టంగా ఏడేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు