రేపు ‘సెట్స్‌’ కన్వీనర్ల ఖరారు

19 Jan, 2017 03:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంసెట్, తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్లను ఉన్నత విద్యా మండలి ఈనెల 20న ప్రకటించనుంది. ఒక్కో సెట్‌కు ముగ్గురి చొప్పున పేర్లను ఆయా యూనివర్సిటీలు బుధవారం ఉన్నత విద్యా మండలికి పంపించాయి. వాటిపై 19న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఒక్కో సెట్‌కు వచ్చిన ముగ్గురి పేర్లలో ఒక్కరిని సెట్‌ కన్వీనర్‌గా నియమించనున్నారు. ఎంసెట్‌ బాధ్యతలను జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ యాదయ్యకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు