హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం షార్జాకు బయలు దేరిన విమానానికి పెనుప్రమాదం తప్పింది. కొద్ది దూరం వెళ్లాక విమాన ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని గర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. సాంకేతిక లోపాన్ని పైలట్ ముందే పసిగట్టడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.