అనురాగాన్ని పంచి...

6 Jan, 2016 23:31 IST|Sakshi
అనురాగాన్ని పంచి...

రెండో రోజూ షర్మిలకు అదే ఆదరణ
ఏడు కుటుంబాలకు పరామర్శ
నేడు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్,
కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పర్యటన    

 
సనత్‌నగర్: అదే ఆప్యాయత... అదే అనురాగం... రాజన్న బిడ్డ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపై నగర వాసులు అపూర్వ ప్రేమాభిమనాలు కురిపించారు. ఆమె రాక కోసం వేలాది కళ్లు ఎంతో ఆసక్తితో నిరీక్షించాయి. షర్మిల రాకతో ఒక్కసారిగా ఆ కళ్లు చెమ్మగిల్లాయి. ‘ఒక అక్కలా ధైర్యాన్ని నూరిపోసింద’ంటూ ఓ చిన్నారి ఆనందం... షర్మిలమ్మ పంచిన ప్రేమామృతం తమకు కొండంత ఆత్మస్టైర్యాన్ని నింపిందంటూ ఓ కుటుంబ సభ్యుల సంతోషం.. ఇలా అందరిలోనూ ఓ కొత్త భరోసా కనిపించింది.

గ్రేటర్ హైదరాబాద్‌లో షర్మిల పరామర్శ యాత్ర రెండో రోజు బుధవారం సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల్లో కొనసాగింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ఆగిన గుండెల ప్రతిరూపాలకు షర్మిల ఆత్మీయ పలకరింపు ఎంతో సాంత్వననిచ్చింది. మూడు నియోజకవర్గాల్లో 7 కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ‘మంచిరోజులు వస్తాయి... చింతించ వద్ద’అంటూ ధైర్యాన్ని చెప్పి ముందుకు కదిలారు.    
 

>
మరిన్ని వార్తలు