ఆకతాయిలకు ‘షీ-టీమ్స్’ కౌన్సెలింగ్

13 Apr, 2016 20:31 IST|Sakshi

నగరంలో యువతులు, మహిళల్ని వేధిస్తూ ‘షీ-టీమ్స్’కు చిక్కిన 20 మంది మైనర్లకు అధికారులు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా నేతృత్వంలో దాదాపు ఐదుగురు నిపుణులు మైనర్లకు వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో ఆ మైనర్లతో అధికారులు ‘షీ మాస్క్’లు ధరించజేశారు.

 

మరిన్ని వార్తలు