అదనపు కార్యదర్శిగా మాణిక్రాజ్
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ హోదాల్లో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియాను సీఎంవో కార్యదర్శిగా నియమించారు.
పశుసంవర్ధక శాఖ బాధ్యతలను కూడా ఆయనకే అదనంగా అప్పగించారు. పలువురు సీనియర్ ఐఏఎస్లు కలెక్టర్ బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పూర్తిస్థాయి కలెక్టర్లను నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఉత్వర్వుల్లో స్పష్టంచేశారు.
బదిలీల వివరాలివీ..