సాక్షి,హైదరాబాద్: నగరంలో తొలిసారి ఎలక్ట్రిక్ బస్సు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ బస్సును సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడపనున్నారు. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బస్సును గ్రేటర్ ఆర్టీసీ ప్రయోగాత్మకంగా నడపనుంది.
నగరానికి చెందిన గోల్డ్ టోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ బస్సులకు డీలర్గా వ్యవహరిస్తోంది. 2 గంటల పాటు చార్జింగ్ చేస్తే 7 గంటల పాటు ప్రయాణ సదుపాయాలు అందజేస్తుంది.