నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం

13 Apr, 2016 11:06 IST|Sakshi

హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల అధికారులతో నీతి ఆయోగ్ సమావేశం హైదరాబాద్ లో బుధవారం ప్రారంభమైంది. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై రాష్ట్రాల అధికారులతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశానికి పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు