వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన పిటిషన్ తిరస్కరించిన స్పీకర్

2 Jul, 2016 15:00 IST|Sakshi
వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన పిటిషన్ తిరస్కరించిన స్పీకర్

హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన 13మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిటిషన్ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.పిటిషన్లు నిబంధనల ప్రకారం లేనందున....డిస్మిస్ చేస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన 13 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డితో పాటు..... మరో ఎమ్మెల్యే షేక్‌ ముస్తఫా వ్యక్తిగత హోదాలో వేసిన రెండు పిటిషన్లను  స్పీకర్ తిరస్కరించారు.

కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ పిటిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు