ఫోన్ మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్

16 Jul, 2016 00:21 IST|Sakshi
ఫోన్ మాట్లాడుతూ బస్సు డ్రైవింగ్

ఆర్టీసీ డ్రైవర్‌కు రూ. వెయ్యి జరిమానా
 
భాగ్యనగర్‌కాలనీ : ఫోన్ లో మాట్లాడుతూనే బస్సు నడుపుతూ ఓ ఆర్టీసీ డ్రైవర్ కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.  సదరు డ్రైవర్‌కు పోలీసు లు చలానా విధించారు.  మియాపూర్ డిపోకు చెంది న బస్సు (ఏపీ11జెడ్ 6563) శుక్రవారం కూకట్‌పల్లి వై జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఆ బస్సు నడుపుతున్నాడు.

ఈ విషయం గమనించిన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతడికి రూ. వెయ్యి చలాన్ విధించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్‌ఐ సైదులు మాట్లాడుతూ... వాహనం నడుపుతూ ఫోన్‌లో మాట్లాడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు.
 
 

మరిన్ని వార్తలు