సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

13 Jan, 2015 19:37 IST|Sakshi

సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఆ జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.
రైళ్ల వివరాలు:
1. విజయవాడ-సికింద్రాబాద్-విజయవాడ స్పెషల్ ట్రైన్(వయా నల్గొండ, గుంటూరు). ఈ రైలు రెండు సర్వీసులు ఉంటాయి.

ఈ రైలు విజయవాడ నుంచి జనవరి 18 మధ్యాహ్నం 2: 30 గంటలకు బయల్దేరి రాత్రి 09: 40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 18 రాత్రి 11:40కి సికింద్రాబాద్ లో బయల్దేరి 19 ఉదయం 6:50కి విజయవాడ చేరుకుంటుంది.

2. హైదరాబాద్-కాకినాడ టౌన్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ (వయా: నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి)-2 సర్వీసులు

ఈ రైలు జనవరి 23 సాయంత్రం 7.20 గంటలకు హైదరాబాద్ లో బయల్దేరి  జనవరి 24 ఉదయం 05:00 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు సాయంత్రం 06:30 గంటలకు కాకినాడలో బయల్దేరి 25వ తేదీ ఉదయం 4.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

మరిన్ని వార్తలు