శంషాబాద్లో విమానం అత్యవసర ల్యాండింగ్

7 Jul, 2016 23:14 IST|Sakshi

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలోని ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో పెలైట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

సదరు ప్రయాణికుడిని వెంటనే ఎయిర్‌పోర్టులోని అపొలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆప్రయాణికుడు చనిపోయాడు. అతడిని పంజాబ్‌కు చెందిన భగత్‌సుభేష్‌గా గుర్తించారు.

మరిన్ని వార్తలు