హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య

2 Feb, 2016 12:44 IST|Sakshi

డి. పోచంపల్లిలోని శ్రీసాయి గణేశ్ బాయ్స్ హాస్టల్లో శివ శృజన్(18) అనే యువ విద్యార్థి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు నోట్ సూసైడ్ నోట్ రాశాడు. శృజన్ దుండిగల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు