హైదరాబాద్: డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ బండ్లగూడలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక మల్లికార్జున్ నగర్కు చెందిన వెన్నెల(16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందింది.