న్యూఢిల్లీ: తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలని శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. హైకోర్టు విభజనకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, బీబీ పాటిల్ మాట్లాడుతూ కేంద్రం తక్షణమే స్పందించి హైకోర్టును విభజన చేపట్టాలని కోరారు.