రాష్ట్రంలో మండుతున్న ఎండలు..

30 Mar, 2017 00:10 IST|Sakshi
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఎండలు మండాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే నిజామాబాద్‌లో 41, హైదరాబాద్‌లో 40.5, మహబూబ్‌నగర్, నల్లగొండ, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని హెచ్చరించింది.

>
మరిన్ని వార్తలు