రెండు నెలల చిన్నారికి స్వైన్‌ఫ్లూ

1 Oct, 2015 21:20 IST|Sakshi

గాంధీ ఆస్పత్రి(హైదరాబాద్): రెండు నెలల పసికందుకు స్వైన్‌ఫ్లూ అని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన సునీతాదేవి రెండు నెలల క్రితం మగశిశువుకు జన్మనిచ్చింది. బాబుకు మూడు రోజులుగా తీవ్రమైన జ్వరం రావడంతో ఈనెల 28వ తేదిన గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. రక్త నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపగా గురువారం అందిన నివేదికలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది.

అలాగే పాతబస్తీకి చెందిన శ్రీనివాస్ (42), రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన శివకుమార్ (35)లకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం గాంధీ స్వైన్‌ఫ్లూ వార్డులో 10మంది రోగులు, డిజాస్టర్‌ వార్డులో మరో పది స్వైన్‌ఫ్లూ అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు