పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి: గట్టు శ్రీకాంత్రెడ్డి

25 Jun, 2016 12:24 IST|Sakshi

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంపునకు నిరసనగా గట్టు శ్రీకాంత్రెడ్డి ఆధ్వరంలో  నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ధర్నా నిర్వహించారు.

ఛార్జీల పెంపును నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.

>
మరిన్ని వార్తలు