‘కఠిన చర్యలు తీసుకోండి’

23 Feb, 2015 15:07 IST|Sakshi
‘కఠిన చర్యలు తీసుకోండి’

హైదరాబాద్ సిటి: తల్లిపాల కోసం గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ప్రాణాలోదిలిన బాబు హృదయవిదారక సంఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మెదక్ జిల్లా హత్నూర్ మండలం కానాపూర్‌లో కూలికి వచ్చిన మహిళ తన బాలుడికి పాలివ్వడానికి కాంట్రాక్టర్ నిరాకరించడంతో ఈ ఘోరం సంభవించింది. ఈ విషయంపై సోమవారం తెలంగాణ తెలుగు మహిళా కన్వినర్ శోభారాణి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు