బీజేపీ నేతలు పిచ్చిమాటలు మానాలి

13 Apr, 2017 17:04 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల అంశంపై బీజేపీ నేతలు పిచ్చిమాటలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు.  

ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల అమలు తీరు గురించి తెలుసుకుని కిషన్ రెడ్డి మాట్లాడాలని తలసాని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోను వందశాతం అమలు చేశామని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించినంత మాత్రానా బీజేపీ నేతలు పెద్దవాళ్లు కాలేరని తలసాని అన్నారు.

మరిన్ని వార్తలు