విద్యార్థిని చితకబాదిన టీచర్

24 Feb, 2016 16:24 IST|Sakshi

హైదరాబాద్: సరిగా చదవట్లేదని విద్యార్థిని టీచర్ చితకబాదిన సంఘటన మీర్‌పేటలో చోటు చేసుకుంది. స్థానిక నాగార్జున మాంటిస్సోరి ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్లో సాత్విక్(12) ఏడో తరగతి చదువుతున్నాడు. అతను సరిగా చదవటం లేదని తెలుగు టీచర్ శ్రీనివాస్ వీపుపై, భుజాలపై బెత్తంతో కొట్టాడు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు