రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

21 Jan, 2016 13:29 IST|Sakshi

పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. చంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన మహ్మద్ ఖాజా మొయినొద్దీన్(52) శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ రోజు ఉదయం పాఠశాలకు బైక్‌పై వెళ్తున్న సమయంలో మైలార్‌దేవ్‌పల్లి ఇండియన్ స్వీట్ హౌస్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆయన కింద పడగానే హెల్మెట్ ఊడిపోయి బస్సు టైరు తలపై నుంచి వెళ్లి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. త్వరలో మొయినొద్దిన్ కూతురు పెళ్లి జరగనుండటంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

మరిన్ని వార్తలు