క్లాసులో విద్యార్థులు తెలుగు మాట్లాడారని ...

15 Jul, 2014 17:10 IST|Sakshi
క్లాసులో విద్యార్థులు తెలుగు మాట్లాడారని ...

పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు తెలుగు మాట్లాడటమే నేరమైంది. తరగతి గదిలో తెలుగు మాట్లాడతారా అంటూ విద్యార్థులకు టీచర్ పెద్ద క్లాస్ తీసుకుంది. తెలుగు మాట్లాడితే తప్పేముంది అని సదరు విద్యార్థులు టీచర్ను ప్రశ్నించారు. అంతే టీచర్కు కోపం కట్టలు తెంచుకుంది. దాదాపు 40 మంది విద్యార్థులను చితకబాది పారేసింది.

 

ఆ సంఘటన మంగళవారం హైదరాబాద్ సనత్నగర్ లోని డాన్ బాస్కో స్కూల్లో చోటు చేసుకుంది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు చేరుకున్నారు. సదరు టీచర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు