హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్ సమన్వయ కమిటీ బుధవారం భేటీయ్యింది.
గాంధీభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు, వలసల కట్టడిపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.