హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం భేటీయ్యారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై గవర్నర్తో వారు చర్చించారు.
కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం భూ సేకరణ జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. గత 100 రోజులుగా ముంపు గ్రామాల్లో విధించిన 144 సెక్షన్ను ఎత్తివేయాలని కోరుతూ నరసింహన్కు వినతి పత్రం సమర్పించారు. గవర్నర్ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు పలువురు నేతలు ఉన్నారు.