అవును.. ఎంసెట్ పేపర్ లీకైంది

2 Aug, 2016 11:49 IST|Sakshi
అవును.. ఎంసెట్ పేపర్ లీకైంది

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2 పేపర్ లీకైందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పేపర్ లీకేజి విషయంపై కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చింది. దాంతో మళ్లీ పరీక్ష నిర్వహించే విషయంపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలపాలని హైకోర్టు కోరింది. అనంతరం ఈ అంశంపై విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

ఏపీ ఎంసెట్‌లో వేలల్లో ర్యాంకులు వచ్చిన కొంతమందికి తెలంగాణ ఎంసెట్‌లో మాత్రం వందల్లో ర్యాంకులు రావడంతో ఎంసెట్-౨ పేపర్ లీకై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేయగా, సీఐడీ విచారణతో మొత్తం గుట్టు రట్టయింది. పేపర్ లీకైనందున పరీక్ష రద్దుచేయాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

మరిన్ని వార్తలు