సచివాలయంలో ఉద్యోగులు విధులు బహిష్కరణ

29 May, 2014 11:42 IST|Sakshi

పోలవరంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విధులు బహిష్కరిస్తున్నట్లు సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... ఇదే అంశంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానున్నామని... అయితే ఆ సమావేశంతో లాభం జరుగుతుందని తాము భావించడం లేదని అన్నారు.

 

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు స్థానికేతరులుగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై  ఫిర్యాదు చేసిన ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదని విమర్శించారు. స్థానికేతరులను బలవంతంగా తెలంగాణంలోకి రుద్దితే ప్రతిఘటించక తప్పదని నరేంద్రరావు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు