ట్యాంక్‌బండ్‌పై టీ-వైఎస్‌ఆర్‌సీపీ నిరసన

20 Aug, 2016 12:18 IST|Sakshi

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ నిరసన చేపట్టింది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీ-వైఎస్‌ఆర్‌సీపీ నిరసనకు దిగింది. తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది.

ఈ నేపథ్యంలో పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు