బీవీబీపీ ప్రిన్సిపాల్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

17 Nov, 2016 18:52 IST|Sakshi
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ సీనియర్ ప్రిన్సిపాల్ సీ రమాదేవిని ప్రతిష్టాత్మక సర్చ్ అవార్డు వరించింది. న్యూఢిల్లీలోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఏటా ఓ ఉత్తమ ప్రిన్సిపాల్ కు ఈ అవార్డును ప్రధానం చేస్తుంది. అందులో భాగంగా 2015 సంవత్సరానికి గాను రమాదేవిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. వచ్చే నెల7వ తేదీన న్యూఢిల్లీలో ఈ అవార్డును బహూకరించనున్నారు.
 
గత ఏడేళ్లుగా పర్యావరణం, ఇంధన పొదుపు, పరిసరాల పరిశుభ్రత, రీ-సైక్లింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు సమాజాన్ని కూడా ఉత్తేజపరిచినందుకు రమాదేవికి ఈ అవార్డును ప్రకటించారు.
మరిన్ని వార్తలు