‘సాక్షి’ ఆధ్వర్యంలో పోటీపరీక్షలపై అవగాహన

24 May, 2015 14:26 IST|Sakshi

హైదరాబాద్: ‘సాక్షి’, వనితా సివిల్స్ అకాడమీ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని వనితా కళాశాలలో ఆదివారం ఉదయం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ హాజరై మాట్లాడారు. సివిల్స్, గ్రూప్ పరీక్షలకు హాజరయ్యే వంద మందికి పైగా అభ్యర్థులు సదస్సులో పాల్గొన్నారు. ఆ అభ్యర్థులకు అవగాహన కల్పించారు. హాజరైన వారంతా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నట్టు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు