23 జిల్లాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుల నియామకం

8 Nov, 2016 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 23 జిల్లాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది. ఆయా జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు... బొడ్డు సాయినాథ్‌రెడ్డి (గ్రేటర్ హైదరాబాద్), బెంబడి శ్రీనివాసరెడ్డి(మేడ్చల్-మల్కాజిగిరి), తుమ్మల పల్లి భాస్కరరావు (సూర్యాపేట), లక్కినేని సుధీర్ (ఖమ్మం), సంగాల ఇర్మియా (వరంగల్-అర్బన్), బొబ్బిలి సుధాకర్‌రెడ్డి (రంగారెడ్డి), మాదిరెడ్ది భగవంతురెడ్డి (నాగర్‌కర్నూల్), నీలం రమేశ్ (కామారెడ్డి), చొక్కాల రాము (రాజన్న-సిరిసిల్ల), బీస మరియమ్మ (మహబూబ్‌నగర్), గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి (సంగారెడ్డి), ఏనుగు రాజీవ్‌రెడ్డి (జగిత్యాల), వొడ్నాల సతీశ్ (మంచిర్యాల), బెజ్జంకి అనిల్‌కుమార్ (ఆదిలాబాద్), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి (వనపర్తి),జమాల్‌పూర్ సుధాకర్(కుమ్రంభీం-ఆసిఫాబాద్),తడక జగదీశ్వర్ గుప్తా(సిద్దిపేట), సెగ్గెం రాజేశ్(పెద్దపల్లి), అప్పం కిషన్ (జయశంకర్- భూపాలపల్లి), కాందాడి అచ్చిరెడ్డి (మహబూబాబాద్), నాడం శాంతికుమార్ (వరంగల్-రూరల్), డా.కె.నగేశ్ (కరీంనగర్).

కాగా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. సోమవారం ఈ మేరకు 23 జిల్లాల అధ్యక్షుల నియామకానికి సంబంధించి పార్టీ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది.

మరిన్ని వార్తలు