బీభత్సం సృష్టించిన కారు

19 Jun, 2016 16:24 IST|Sakshi

ఎంఐజీ కాలనీ ప్రదాన రోడ్డుపై ఆదివారం ఉదయం ఓ కారు భీభత్సం సృష్టించింది. శేరిలింగంపల్లికి చెందిన ముగ్గురు యువకులు మారుతీ కారులో కీర్తిమహల్ నుంచి పాత ఎంఐజీ కాలనీకు వస్తున్నారు. మీతి మీరిన వేగంతో కారును నడపడంతో అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. రోడ్డుపై ఎడమవైపు వెళుతున్న కారు పల్టీలు కొట్టి కుడిచేతి వైపు రోడ్డు పక్కనున్న కాల్వలోకి పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు మాత్రం స్వల్ప గాయలతో బయటపడ్డారు. అ సమయంలో ఆ మార్గంలో వాహనాలు రాకపోవడంతో అందరు ఊపిరిపిల్చుకున్నారు.

 

>
మరిన్ని వార్తలు