లంగర్హౌస్లోని బాపూఘాట్ వద్ద భారత జాతిపిత మహాత్మా గాంధీజీకి తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి మహేందర్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.