యువతి అదృశ్యం

17 Jun, 2016 19:26 IST|Sakshi

ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టెలికాంనగర్‌లో నివాసం ఉండే పి.భవిత(22) ఈ నెల 16న తెల్లవారు జామున 4 గంటల సమయంలో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి సురేష్‌రెడ్డి శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు