హయత్నగర్లో దారుణం చోటుచే సుకుంది. సుమారు 3 నెలల వయసున్న ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్లపొదల్లో వదిలి వెళ్లారు. పాప ఏడుపు విని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి 108 వాహనాన్ని రప్పించి చిన్నారిని శిశువిహార్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.