సాక్షి, హైదరాబాద్ : రైతులకు (2015-16) పంట నష్టపరిహారం అందించాలని, రుణమాఫీ నిధులను విడుదల చేయాలని, వ్యవసాయ రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. కరువు సాయం కింద కేంద్రం విడుదల చేసిన రూ.721 కోట్లు ఏమయ్యాయని, ఆ నిధులకు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ కలిపి రైతులకు ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ప్రశ్నించారు.
వ్యవసాయ రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. అటు కేంద్ర సహాయం, ఇటు ఇన్పుట్ సబ్సిడీ అందక, రుణమాఫీ జరగక రైతుపై ముప్పేట దాడి జరుగుతోందని.. సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.