పెళ్లింట విషాదం...

18 May, 2017 01:06 IST|Sakshi
పెళ్లింట విషాదం...

బుధవారం రాత్రి 11.22 నిమిషాలకు పెళ్లి. వరుడు ఎన్నో కలలతో సంతోషంగా బంధువులతో కలిసి వధువు ఇంటికి వాహనంలో బయలుదేరారు. ఇంతలోనే విధి వక్రించింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు మార్గమధ్యలో సూర్యాపేట– ఖమ్మం రహదారిపై చర్ల వద్ద ఆపిన వీరి వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో కూకట్‌పల్లికి చెందిన వరుడు శేషసాయినాథ్‌.. అతని బంధువులు సత్యనారాయణ, అఖిల్, దామోదర్‌ మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

>
మరిన్ని వార్తలు