ఐ హేట్ గర్ల్స్

28 Dec, 2015 12:54 IST|Sakshi
ఐ హేట్ గర్ల్స్

'నాకు అమ్మాయిల మీద విరక్తి పుట్టింది.. నన్ను ఓ అమ్మయి మోసం చేసింది.. అమ్మాయిలంతా అంతే.. అమ్మాయిలను నమ్మకండి' అని గోడల మీద రాసి ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ కే టీఆర్ కాలనీలోని ఎస్‌వీపీ రెసిడెన్స్‌లో సోమవారం వెలుగు చూసింది.


వివరాలు.. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గల్లా సుధీర్(21) ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మోసం చేయడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి తన ఫ్లాట్‌లో పార్టీ చేసుకున్న అనంతరం సోమవారం తెల్లవారుజామున కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు స్నేహితులకు వీడ్కోలు పలికి ఇంట్లోని గోడలపై 'అమ్మాయిలను నమ్మకండి.. నన్ను ఓ అమ్మాయి మోసం చేసింది..' అని రాసి పెట్టాడు.  సోమవారం ఫ్లాట్ తలుపు తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు తలుపులు పగ లగొట్టి చూడగా.. సుధీర్ అప్పటికే మృతిచెందాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు