బురఖా వేసుకుని చోరీలు

29 Apr, 2016 12:38 IST|Sakshi
బురఖా వేసుకుని చోరీలు

హైదరాబాద్ : నగరంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా ఓ దొంగ బురఖా వేసుకుని చోరీలు చేస్తున్నాడు. ఆ క్రమంలో శుక్రవారం నాంపల్లిలో పోలీసులకు దొరికిపోయాడు. అతడిని  పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 44 తులాల బంగారంతోపాటు రూ. 19500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు