హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్టులోని మెంజిస్ కాట్రాక్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి ద్వారా 3.5 కిలోల బంగారు తెప్పించాడు. విషయం తెలిసిన విమానాశ్రయ డీఆర్ఐ అధికారులు శుక్రవారం ఉదయం బంగారం తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.