హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రతిపాదనలో భాగంగా శంషాబాద్ జిల్లాలో మూడు మండలాలను చేర్చనున్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని అధికారులను సీఎం ఆదేశించారు.