‘ఇదేనా మన విశ్వనగరం’

21 Sep, 2016 10:37 IST|Sakshi
‘ఇదేనా మన విశ్వనగరం’

‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇదేనా మన విశ్వనగరం, ఇదేనా డల్లాస్ పట్టణం గోదారిని తలపిస్తున్న నగర రోడ్లపై సామన్యుడి బతుకు దుర్భరమవుతున్న పట్టించుకోవడం లేదంటూ’.. టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలకా మధుసూధనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని వనస్థలిపురం పనామా వద్ద గుంటలు పడ్డ జాతీయ రహదారిపై ఆయన ఆధ్వర్యంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత వారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్ని గుంటల మయమయ్యాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోతోంది. విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలకడం తప్పి కేసీఆర్ చేసిందేమి లేదని ఎద్దేవ చేశారు.

 

మరిన్ని వార్తలు