నేడు జేఈఈ మెయిన్‌ ఫలితాలు

27 Apr, 2017 00:43 IST|Sakshi
నేడు జేఈఈ మెయిన్‌ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2న నిర్వ హించిన జేఈఈ మెయిన్‌ ఫలితాలు నేడు (గురువారం) విడుదల కానున్నాయి.

ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాదాపు 78 వేల మంది హాజరయ్యారు. ఈ నెల 28 నుంచి మే 2 వరకు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్‌ 2.20 లక్షల మంది నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

మరిన్ని వార్తలు