టుడే న్యూస్ అప్ డేట్స్

29 Sep, 2016 07:28 IST|Sakshi

హైదరాబాద్ : నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష

నేడు కేంద్రమంత్రి ఉమాభారతితో కర్ణాటక సీఎం భేటీ. కావేరి జలాలపై చర్చించనున్న కేంద్రమంత్రి

ఏపీలో నేటి ఎంబీబీఎస్, బీడిఎస్ యాజమాన్య కోటా కౌన్సెలింగ్ వాయిదా. సుప్రీంకోర్టు గడవు ఇచ్చినందున అక్టోబర్ 3న కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం.

కరీంనగర్ జిల్లాలో నేడు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నేతల పర్యటన. మిడ్ మానేరు ప్రాజెక్టుతోపాటు ముంపు గ్రామాలను వైఎస్ఆర్ సీపీ నేతలు పరిశీలించనున్నారు.

తెలంగాణలో నేడు మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్

హైదరాబాద్ : నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి కేటీఆర్. భారీ వర్షాల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న కేటీఆర్. శుక్రవారం జరగనున్న స్వచ్ఛ భారత్ సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు.

 

మరిన్ని వార్తలు