► అమరావతి: ఇవాళ్టితో ముగియనున్న మహిళా పార్లమెంట్ సదస్సు. హాజరుకానున్న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్.
► నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాలపై ఏర్పాటైన 'బజాజ్ కమిటీ' పర్యటన. రేపు తెలంగాణ, ఎల్లుండి ఏపీ అధికారులతో భేటీ కానున్న బజాజ్ కమిటీ. 15న రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్తంగా కమిటీ సమావేశం.
► పోస్టల్-కార్మిక ఉపాధిశాఖల మధ్య నేడు ఒప్పందం. నేషనల్ కెరీర్ సర్వీస్తో తపాలా కార్యాలయాల అనుసంధానం.
► శ్రీహరికోట: ఇవాళ లెవల్-1, లెవల్-2, లెవల్-3 పరీక్షలతో పాటు ఎమ్ఆర్ఆర్ సమావేశం. ఈ నెల 15న పీఎస్ఎల్వీ సీ-37 ద్వారా 104 ఉపగ్రహాల ప్రయోగం. 14న ఉదయం 5:28 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం.
► చెన్నై: గవర్నర్ తీరుకు నిరసనగా ఇవాళ్టి నుంచి శశికళ వర్గం నిరసనలు.
► సూర్యాపేట: ఇవాళ్టి నుంచి సూర్యాపేట పెద్దగట్టు జాతర.
► అంధుల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో నేడు పాకిస్తాన్తో తలపడనున్న భారత్.