మహిళా దినోత్సవం
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సదర్భంగా మహిళలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. మార్పుకోసం మహిళలు ధైర్యంగా ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చారు.
పీఏసీ సమావేశం
విజయవాడ: పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన నేడు వెలగపూడిలో పీఏసీ కమిటి సమావేశం. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.
పన్నీర్ సెల్వం నిరాహారదీక్ష
నేటి నుంచి పన్నీర్ సెల్వం నిరాహార దీక్ష. అమ్మ మృతిపై విచారణ జరిపించాలన్న డిమాండ్తో చెంగల్పట్టులో దీక్షకు దిగనున్న పన్నీర్ సెల్వం.
చివరి విడత పోలింగ్
ఉత్తరప్రదేశ్, మణిపూర్లో చివరి విడత ఎన్నికలు. యూపీలో 40, మణిపూర్లో 22 స్థానాలకు పోలింగ్.
తుందుర్రు మహిళల ర్యాలీ
పశ్చిమ గోదావరి: తుందుర్రు ఆక్వాఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా మహిళలు తలపెట్టిన నేటి ర్యాలీకి వైఎస్ఆర్సీపీ, సీపీఎం మద్దతు. తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు, ఇప్పటికే పలువురు పోరాట కమిటీ సభ్యులను అరెస్ట్ చేశారు.
► గుజరాత్: నేడు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.